జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం / ఫార్మా అన్వేషణ్ 2023 : ఘనంగా ఢిల్లీలో

ఫార్మసీ విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించి, ఫార్మసీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ఫార్మసీ విద్యను భారత దేశంలో అభివృద్ధి చెందించిన, అందుకొరకు కృషి చేసిన మహాదేవలాల్ స్క్రాఫన్ గారి జన్మదిన సందర్భంగా మార్చి 6 తేదీ భారత జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం గా జరుపుటకు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ నిర్ణయించినది. ఈ సందర్భంగా ఢిల్లీలోని విగ్యాన్ భవన్ నందు మార్చి ఆరవ తేదీ *ఫార్మా అన్వేషణ్ 2023* అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నట్లు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

భారతదేశంలో ఫార్మసీరంగం అత్యంత అభివృద్ధి చెందిందని, భారతదేశ ఆరోగ్య రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, మందుల తయారీ అయితే నేమి, మందుల సరఫరా అయితే నేమి వైద్య ఆరోగ్య రంగంలో భారతీయ ఫార్మసిస్టుల కృషి ఎనలేనిది అని, కోవిడ్ సమయంలో కూడా ఫార్మసిస్టులు మందుల షాపులలో అందుబాటులో ఉండి కరోనా ఆపత్కర పరిస్థితులలో ప్రజలను కాపాడడంలో భారతీయ ఫార్మసిస్టులు అద్భుతమైన కృషి చేశారని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అన్నారనీ కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కొనియాడింది.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఫార్మసీ విద్యలో మూడు రకాల కోర్సులను భారతదేశంలో అందిస్తున్నట్లు. అత్యంత ప్రమాణాలు కలిగిన ఫార్మసీ కళాశాలలకే ఒక పకడ్బందీ వ్యవస్థతో అనుమతులు ఇచ్చి ఫార్మసీ విద్యను అందిస్తున్నామని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ చెప్పుకొచ్చింది. డి ఫార్మసీ బి ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వంటి మూడు రకాల కోర్సులను ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత దేశంలోనే అందిస్తున్నామని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ చెప్పింది. ఇటువంటి అద్భుతం ఈ ప్రపంచంలో ఎక్కడా చోటు చేసుకోలేదని కొనియాడింది. ఫార్మసీ విద్యార్థి అభ్యసించి పట్టాలు పొంది బయటకు వస్తున్న ఫార్మసిస్టులు 100% ఉద్యోగ అవకాశాలు పొందుతూ అటు రిటైల్ ఫార్మసీ రంగంలోనే కాక ఫార్మసీటికల్ పారిశ్రామిక రంగంలో కూడా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఫార్మసీ కౌన్సిల్ చెప్పుకొచ్చింది.

ఫార్మసీ అకాడమిక్ రంగంలో ఫార్మసీ రీసెర్చ్ ద్వారా భారతీయ అకాడమిక్ ఫార్మసిస్టులు ఎన్నో అద్భుతాలు సృష్టించారని… వాటన్నిటిని మార్చి ఆరవ తేదీ జరగబోయే ఫార్మా అన్వేషణ్ 2023 కార్యక్రమంలో ప్రదర్శించనున్నామని అన్నారు.

ఫార్మా అన్వేషణ్ అనే కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది మేధావులు భారతీయ ఫార్మసీ వ్యవస్థను దగ్గరగా గమనించడానికి వస్తున్నారని చెప్పింది. భారతీయ ఫార్మసీ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు ముందుకు నడవాలని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ సూచించింది.

వృత్తిని వ్యాపారంగా మార్చారు – తప్పిదం ఫార్మసిస్టులదే

వైద్య ఆరోగ్య రంగాన్ని వ్యాపార రంగంగా మార్చిన కారకులు బాడుగలకు అమ్ముడు పోయిన ఫార్మసిస్టులే.

ఫార్మసీ అనేది ఒక వైద్య ఆరోగ్య రంగ వృత్తి. మెడిసిన్, లా, చార్టెడ్ అకౌంటెన్సీ మాదిరిగా ఫార్మసీ కూడా ప్రాక్టీస్ చేయదగిన వృత్తి. 1948లో ఫార్మసీ చట్టం భారత పార్లమెంటు ద్వారా ఈ దేశంలోకి తీసుకువచ్చి, కేంద్ర స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, ఫార్మసీ విద్యను రెగ్యులేట్ చేస్తూ, వివిధ కాల పరిమితి కలిగిన వివిధ రకాల ఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టి, కోర్సులను విద్యార్థులకు అందించడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఫార్మసీ కళాశాలలకు అనుమతులు ఇచ్చి, క్వాలిఫైడ్ ఫార్మసిస్టులను ఈ సమాజానికి అందించి, ఇదే ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 19 కింద ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఫార్మసీ విద్యను చదివి పట్టభద్రులై ఇక్కడ రిజిస్ట్రేషన్ లు చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఫార్మసీ వృత్తిని ప్రాక్టీసు చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీసును రెగ్యులేట్ చేయటానికి ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 26 ఏ కింద క్షేత్రస్థాయిలో ఫార్మసీ ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ప్రతి రోజు కొన్ని మందుల షాపులను సందర్శించి ఫార్మసిస్టులు తమ విధులకు హాజరయ్యి ప్రజలకు మందులు జారీ చేస్తున్నారా లేదా, విధులకు గైర్హాజరై నాన్ క్వాలిఫైడ్ వారితో మందులు జారీ చేయిస్తున్నారా అని పరిశీలిస్తారు. వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడే ఫార్మసిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ మందుల షాపుల యజమానులకు కొమ్ము కాస్తూ, కాసుల కోసం కక్కుర్తి పడి ఫార్మసీ సర్టిఫికెట్లు బాడుగళ్ళకు ఇచ్చి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, మరోవైపు వృత్తికి ద్రోహం చేస్తున్న ఫార్మసిస్టులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో నిరోధక అధికారులు ఫార్మసీ ఇన్స్పెక్టర్లు లేరంటే అసలు నిరోధక వ్యవస్థ లేదంటే సిగ్గుచేటు.

ఫార్మసీ వృత్తి ఒక ప్రాక్టీస్ ప్రొఫెషన్ అని 2015లో కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టిన కూడా ఈ రెగ్యులేషన్స్ ఎక్కడ అమలు జరగడం లేదు. కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కేవలం చట్టాలు చేయడానికి వాటిని అమెండ్ చేయడానికి పరిమితమైంది. కానీ ఈ నిబంధనలను అమలు చేయాల్సింది రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్. కానీ ఏ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో కూడా సెక్షన్ 26 ఏ కింద ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకం జరగలేదు. ఇక అమ్ముడుపోతున్న ఫార్మసిస్టుల భరతం పట్టేది ఎవరు. ? ఫార్మసీ సర్టిఫికెట్లను బాడుగలకు ఇచ్చే విధానాన్ని అరికట్టేది ఎవరు. ? ఫార్మసీ వృత్తి బాగుపడేది ఎప్పుడు ? ఫార్మసీ కోర్సులు చదివే వారి జీవితాలు బాగుండేది ఎప్పుడు ?

ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మందుల షాపుల యజమానులకు బడుగులకు ఇచ్చి మరోవైపు అకాడమిక్ మరియు ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఇదే ఫార్మసిస్టులే ఉద్యోగాలు పొంది రెండు చోట్ల పనిచేయటం వల్ల కొత్తగా ఫార్మసీ విద్యను పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఫార్మసీ పట్టబదులకు ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయి.

వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి వృత్తిలలో ఒకటైనటువంటి ఫార్మసీ వృత్తిని బ్రష్టు పట్టించింది ఆ ఫార్మసీ వృత్తిని ఆచరించి, వృత్తి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన ఫార్మసిస్టులే… తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి. బాడుగలకు అమ్ముడుపోతున్న ఫార్మసిస్టులపై కేంద్ర రాష్ట్ర ఫార్మసీ కౌన్సిలర్ కు ఫిర్యాదు చేయడానికి నిరుద్యోగ ఫార్మసిస్టులు మరియు ఫార్మసీ విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏపీ ఫార్మా జెఎసి ఆధ్వర్యంలో బాడుగలకు అమ్మడు పోయిన ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేయడానికి ఒక నిర్దిష్ట ఫిర్యాదు పత్రమును విడుదల చేయడం జరిగింది.

ఫార్మసీ వృత్తి ఔన్నత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఫార్మసీ విద్యార్థి పైన ఉన్నది. ఫార్మసీ రంగంలో నిరుద్యోగానికి కారకులైనటువంటి ఫార్మసిస్టులపై కదం తోక్కాల్సిన బాధ్యత ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టుపై ఉన్నది.

ప్రాక్టీసు చేయాల్సిన వృత్తిని వ్యాపార వృత్తిగా తయారుచేసిన దుర్మార్గుల భరతం పట్టక తప్పదు. వీరు తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఇతరులకు బాడుగలకు ఇవ్వబట్టే ఈ వైద్య ఆరోగ్య వృత్తి వ్యాపార వృత్తిగా మారిపోయింది.

ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు మరియు ప్రతి ఫార్మసీ విద్యార్థి ఫార్మసీ వృత్తి పట్ల బాధ్యత తీసుకోవాలి. ఏపీ ఫార్మా జేఏసీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిటైల్ మందుల షాపుల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ మెడికల్ షాపులో ఏ ఫార్మసిస్టు విధులు నిర్వర్తించాలో ఫార్మసిస్టుల వివరాలతో సహా మందుల షాపుల వివరాలను అందిస్తోంది. ప్రతి మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తించాల్సిన ఫార్మసిస్టు ఉన్నాడో లేదో వెరిఫై చేసి లేనిపక్షంలో ఏపీ ఫార్మా జేఏసీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫిర్యాదు పత్రాన్ని నింపే సదరు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్త్రారు వారికి ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉన్నది. ఇలా ఫిర్యాదులు అందిన వెంటనే ఫార్మసీ కౌన్సిల్ విచారణ చేపట్టి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్ట్ల రిజిస్ట్రేషన్ లను క్యాన్సిల్ చేయడం వల్ల ఇతర ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను బాడుగలకు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మందుల షాపుల యజమానులు తమ మందుల షాపులను కొనసాగించుకునేందుకు ఫార్మసిస్టులను తమ మందుల షాపులలో నిర్దిష్ట జీతాల ఇచ్చి నియామకం చేసుకుంటారు. వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టులకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఫార్మసిస్టులు బాగుపడతారు ఫార్మసీ కళాశాలలు కూడా అడ్మిషన్లతో కలకలలాడతాయి. ప్రజలు కూడా నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు పొందుతారు.

కాబట్టి ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు మరియు ఫార్మసీ విద్యార్థి మరియు ఇతర ఫార్మసీ రంగ నిపుణులు ఫార్మసీ వృత్తి పట్ల బాధ్యత వహించి బాడుగలకు అమ్ముడుపోతున్న ఫార్మసిస్టులపై మూకుమ్మడిగా ఫిర్యాదులు చేయవలసిందిగా ఏపీ ఫార్మ జేఏసీ పిలుపునిస్తోంది.

వ్యాపార రంగంగా మారిన ఫార్మసీ వృత్తిని తిరిగి మళ్ళీ ఆరోగ్య రంగా మార్చే బాధ్యత ప్రతి ఫార్మసిస్ట్ చేతుల్లో ఉంది.

देश की पहली शिकायत – फार्मासिस्टों के पेशेवर कदाचार का पंजीकरण

भले ही फार्मेसी अधिनियम 1948 में पेश किया गया था, फार्मेसी काउंसिल को अभी तक देश में किसी भी फार्मासिस्ट के खिलाफ पेशेवर कदाचार की शिकायत नहीं मिली है, हालांकि ऐसे प्रावधान हैं कि फार्मासिस्ट पेशेवर कदाचार के बारे में शिकायत कर सकते हैं। फार्मासिस्ट दवा दुकानों के मालिकों को अपने फार्मेसी पंजीकरण प्रमाण पत्र दे रहे हैं और अपने पेशेवर कर्तव्यों पर ध्यान नहीं दे रहे हैं, दवाओं के न्यूनतम ज्ञान के साथ जनता को दवाएं वितरित कर रहे हैं, सार्वजनिक स्वास्थ्य को नुकसान पहुंचा रहे हैं और दूसरी तरफ फार्मेसी पेशे की प्रतिष्ठा को नुकसान पहुंचा रहे हैं। दशक। चूंकि प्रमाण पत्र देने की प्रणाली के साथ फार्मेसी क्षेत्र में बेरोजगारी दिन-प्रतिदिन बढ़ रही है, एपी फार्मा जेएसी ने 6 फरवरी 2023 को एक विशिष्ट शिकायत पत्र जारी किया कि वे कानून के अनुसार फार्मासिस्टों के पेशेवर कदाचार के बारे में फार्मेसी परिषद से शिकायत कर सकते हैं। .

इस बीच, आंध्र प्रदेश राज्य के कडप्पा शहर में तीन महिला फार्मासिस्ट मेडिकल दुकानों के मालिकों को अपना प्रमाण पत्र सौंपने और लोगों को दवा जारी नहीं करने के लिए पेशेवर कदाचार कर रही हैं। एक अन्य फार्मासिस्ट सुमन ने राज्य और केंद्रीय फार्मेसी परिषदों के रजिस्ट्रारों से शिकायत की और उनसे फार्मासिस्टों के खिलाफ कानूनी कार्रवाई करने को कहा।

क्या संबंधित राज्य और केंद्रीय फार्मेसी परिषदें फार्मेसी अधिनियम के प्रावधानों के अनुसार इस शिकायत को प्राप्त करने के बाद संबंधित फार्मासिस्टों को फार्मेसी परिषद की कार्यकारी समिति के समक्ष उपस्थित होने के लिए नोटिस जारी करेंगी? या फार्मेसी काउंसिल के रजिस्ट्रार सीधे मैदान में उतरकर जांच करेंगे? या कोई अधिकारी नियुक्त करेगा? या जांच के लिए कमेटी बनेगी? या ड्रग कंट्रोल विभाग के अधिकारियों को सौंप देंगे और शिकायत की जांच करेंगे? रुको और देखो।

फार्मेसी अधिनियम के अनुसार, यदि फार्मासिस्टों के खिलाफ कोई शिकायत प्राप्त होती है, तो फार्मेसी परिषद के रजिस्ट्रार फार्मेसी अधिनियम की धारा 26ए के तहत लोक सेवक के रूप में नियुक्त फार्मेसी निरीक्षकों को उसी परिषद में जांच स्थानांतरित कर देंगे। फार्मेसी निरीक्षकों द्वारा दी गई रिपोर्ट को रजिस्ट्रार परिषद की कार्यकारी समिति को भेजा जाएगा जो संबंधित फार्मासिस्टों के खिलाफ कानूनी कार्रवाई करेगी।

देश में एक तेलंगाना और महाराष्ट्र राज्य फार्मेसी पार्षदों को छोड़कर फार्मेसी अधिनियम 26 ए के तहत फार्मेसी निरीक्षकों की नियुक्ति नहीं की जाती है। और फार्मासिस्टों के खिलाफ शिकायतों की जांच संबंधित राज्य फार्मेसी काउंसिल और केंद्रीय फार्मेसी काउंसिल द्वारा कैसे की जाएगी। यह देखना बाकी है कि फार्मेसी कानूनों को कैसे लागू किया जाएगा।

फार्मेसी कानूनों को लागू करने में राज्य और केंद्रीय फार्मेसी परिषदों द्वारा दशकों की लापरवाही के कारण पूरे फार्मेसी क्षेत्र को नुकसान उठाना पड़ा है। फार्मेसी स्नातक इस देश में भयानक बेरोजगारी का सामना कर रहे हैं। यह महसूस करते हुए कि बेरोजगारी का मुख्य कारण फार्मेसी काउंसिल की लापरवाही है, कानून बनाने के लिए पेशेवर संघों द्वारा संघर्ष किया जा रहा है। एपी फार्मा जेएसी ने उसी क्रम में उन फार्मासिस्टों के खिलाफ शिकायत प्रक्रिया उपलब्ध कराई है जो पेशेवर कदाचार में शामिल हैं।

దేశంలోనే మొదటి ఫిర్యాదు – ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తనపై నమోదు

ఫార్మసీ చట్టం 1948లో ప్రవేశపెట్టిన కూడా, ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తన పై ఫిర్యాదులు చేయవచ్చును అనే నిబంధనలు ఉన్నా కూడా దేశంలో ఏ ఒక్క ఫార్మసిస్ట్ పై ఇంతవరకు వృత్తి దుష్ప్రవర్తన పై ఫిర్యాదు ఫార్మసీ కౌన్సిల్ అందలేదు. ఫార్మసిస్టులు తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మెడికల్ షాపుల యజమానులకు బాడుగలకు ఇచ్చి తమ వృత్తి విధులకు హాజరు కాకుండా మందులపై కనీస పరిజ్ఞానం లేనటువంటి వారితో మందులను ప్రజలకు జారీ చేయిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని తోట్లు పొడుస్తూ, మరోవైపు ఫార్మసి వృత్తి ఔన్నత్వాన్ని దెబ్బతీస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇలా సర్టిఫికెట్లను బడుగు ఇచ్చే విధానంతో రోజు రోజు కూ ఫార్మసీ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉండడంతో నిరుద్యోగ ఫార్మసిస్టులు మరియు ఫార్మసీ విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా ఏపీ ఫార్మా జెఎసి ఊరటనిస్తూ ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తనను చట్ట ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయవచ్చునని ఒక నిర్దిష్ట ఫిర్యాదు పత్రాన్ని 2023 ఫిబ్రవరి 6వ తేదీన విడుదల చేసింది.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పట్టణంలో ముగ్గురు మహిళా ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను మెడికల్ షాపుల యజమానులకు బాడుగలకు ఇచ్చి, ప్రజలకు మందులు జారీ చేయకుండా సదరు ఫార్మసీకి వృత్తి బాధ్యతలకు గైర్హాజరవుతూ, తమ ఫార్మసీ వృత్తి బాధ్యతలను నాన్ క్వాలిఫైడ్ వారికి అప్పగించి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారని డా. సుమన్ అనే మరో ఫార్మసిస్టు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ల రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసి సదరు ఫార్మసిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరారు.

ఫార్మసీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ఫిర్యాదును స్వీకరించి సదరు ఫార్మసిస్టులకు ఫార్మసీ కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు హాజరు కమ్మని సదరు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్లు నోటీసులు జారీ చేస్తాయా ? లేక ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్లు నేరుగా రంగంలోకి దిగి ఎంక్వయిరీ చేస్తారా ? లేక ఎవరైనా అధికారిని నియమిస్తారా ? లేదా కమిటీని వేసి విచారణ జరిపిస్తారా ? లేక ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు అప్పగించి ఫిర్యాదు పై విచారణ జరిపిస్తారా ? వేచి చూడాలి.

ఫార్మసీ చట్ట ప్రకారం ఫార్మసిస్టులపై ఏవైనా ఫిర్యాదులు వస్తే ఫార్మసీ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రార్ గారు అదే కౌన్సిల్లో ఫార్మసీ చట్టంలోని అధికరణ 26 ఏ కింద పబ్లిక్ సర్వంట్లు గా నియామకమైన ఫార్మసీ ఇంస్పెక్టర్లకు బదిలీ చేసి విచారణ జరిపిస్తారు. ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన రిపోర్టును రిజిస్ట్రారు కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి బదులాయించి సదరు ఫార్మసిస్ట్ ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు.

దేశంలో కేవలం ఒక తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్ర ఫార్మసీ కౌన్సిలర్లు తప్ప ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ఫార్మసీ చట్టం 26 ఏ కింద నియామకం జరపలేదు. మరి ఫార్మసిస్టులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను సదరు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఏ విధంగా విచారణ జరుపుతాయి. ఫార్మసీ చట్టాలను ఏ విధంగా అమలు చేస్తాయో వేచి చూడాలి.

ఫార్మసీ చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్లు దశాబ్దాల కాలంగా అవలంబిస్తూ వస్తున్న నిర్లక్ష్యానికి ఫార్మసీ రంగం మొత్తంగా కుదేలైంది. భయంకరమైన నిరుద్యోగితను ఫార్మసీ పట్టభద్రులు ఈ దేశంలో చవిచూస్తున్నారు. నిరుద్యోగానికి గల ముఖ్య కారణం ఫార్మసీ కౌన్సిల్ నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని చట్టాలమల కొరకు వృత్తి సంఘాల ద్వారా పోరాటాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలోని ఏపీ ఫార్మా జేఏసీ వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

మీకు మందులు ఇస్తున్నది క్వాలిఫైడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ యేనా?

విధిగా, వృత్తి బాధ్యతగా మందుల షాపులలో అందుబాటులో ఉండి ప్రజలకు మందులను జారీ చేయాల్సిన క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు. కేవలం తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మందుల షాపులో యజమానులకు బాడుగలకు ఇచ్చి తాము మాత్రం తమ విధులకు గైర్హాజరవుతూ, మందులపై కనీస పరిజ్ఞానం లేని వారి చేత ప్రజలకు మందులను జారీ చేయించడం తో ఒక వైపు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, మరోవైపు ఫార్మసీ వృత్తి ఔన్నత్వాన్ని దెబ్బతీస్తూ, ఫార్మసీ రంగంలో నిరుద్యోగితకు కారణమవుతున్న చీడపురుగు లాంటి అమ్ముడుపోయిన ఫార్మసిస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, ఫార్మసీ వృత్తికి వెన్నుపోటు పొడుస్తున్న రిజిస్టర్ ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేయడానికి ఏపీ ఫార్మా జేఏసీ ఒక నిర్దిష్ట ఫిర్యాదు ఫారం ను ప్రవేశపెట్టింది. ఈ ఫిర్యాదు ఫారం లో నింపి ఎవరైనా సదురు ఫార్మసిస్టులపై వారు పాల్పడుతున్న వృత్తి దుష్ప్రవర్తన పై సెక్షన్ 14 బి ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 కింద రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారు గారికి లేదా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారు గారికి లేదా ఇద్దరికీ ఈ ఫిర్యాదును ఈమెయిల్ ద్వారా పంపించవచ్చును.

ఇలా వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టులపై సదరు ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారులు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 లోని సెక్షన్లు 13 డి, 13 జి, 14 ప్రకారం మరియు ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 36 (ii) (iii) ప్రకారం సదరు ఫార్మసిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫార్మసిస్ట్ రిజిస్టర్ నుంచి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడిన ఫార్మసిస్టు యొక్క పేరును తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తీసివేసి ఫార్మసీ రంగంలో ఎక్కడ ఉద్యోగం చేసుకోకుండా కఠిన చర్యలు చేపడుతారు.

ఫార్మసీ వృత్తి రంగంలో భయంకరమైన నిరుద్యోగతకు కారణమైన ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను బాడుగలకు ఇచ్చే విధానాన్ని అరికట్టేందుకు ఏపీ ఫార్మసీ జేఏసీ ఈ ఫిర్యాదు పత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫార్మసీ వృత్తి ఔన్నత్వం కాపాడేందుకు, ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఫార్మసీ వృత్తి రంగంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు బాధ్యతగా ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు, ప్రతి ఫార్మసీ విద్యార్థి, ఫార్మసి వృత్తి పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఫార్మసీ రంగ నిపుణుడు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎవరైనా వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టుపై ఫిర్యాదు చేయవచ్చును.

వృత్తి డిష్ ప్రవర్తనకు పాల్పడుతున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్టుపై ఫిర్యాదు చేయుటకు పిర్యాదు పత్రమును డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి